తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 4 వ తరగతి ఉద్యోగులు మరియు నాన్-గెజిటెడ్ ఉద్యోగులందరికి ఈ సదుపాయం వర్తిస్తుంది.
1978 నుండి ఈ సదుపాయం అందుబాటులో ఉంది.
ఎల్కెజి నుండి ఇంటర్మీడియట్ / 12 వ తరగతి చదువుతున్న పిల్లలకు ఇద్దరికి మించకుండా వర్తిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో మాత్రమే పిల్లలు చదువుతూ ఉండాలి.
ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజు ఉండదు కాబట్టి ఆయా పాఠశాలలలో చదివే వారికి ఈ వర్తింపు ఉండదు.
ట్యూషన్ ఫీస్ రేయింబర్స్మెంట్ చేయమని కోరుతూ DDO కు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు తో పాటుగా పాఠశాల నుండి స్టడీ సర్టిఫికెట్, పాఠశాల గుర్తింపు కాపీ,ఫీజు చెల్లింపు రసీదులను జత చేయాలి.
పదవ పే రివిజన్ కమిషన్, 2015, ట్యూషన్ ఫీజుల రీయింబర్స్మెంట్ను సంవత్సరానికి ఒక్కో పిల్లవాడికి రూ 1000 / - నుండి రూ .2500 / - (రూ. రెండు వేల మరియు ఐదు వందల మాత్రమే) పెంచుతూ ప్రతిపాదన చేసింది
తెలంగాణ రాష్ట్రం 10 వ PRC రికమండేషన్ ప్రకారం ఈ మొత్తాన్ని 2500/-కి పెంచుతూ ఉత్తర్వులు సంఖ్య 27 తేదీ 24.09.2015 విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ PRC కమిషన్ ప్రతిపాదనల ప్రకారం ట్యూషన్ ఫీజు రేయింబర్స్మెంట్ ఒక్కో విద్యార్థికి సంవత్సరం కి రూ.27000/-(ఇరవై ఏడు వేల రూపాయలు)ఇద్దరికి మించకుండా వర్తిస్తుంది.
బిల్లు TPTC Form-47 లో డ్రా చేయాలి.
ఇటీవల ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దీనిపై Memo.No. 9782/593/A/Admin.I/2017 తేది:23.7.2018 ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది.
010 పద్దు ద్వారా జీతాలు డ్రా చేస్తున్న నాన్ గజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులు అర్హులు.
ఉద్యోగుల పిల్లలు చదివే పాఠశాల రాష్ట్ర లేక కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందియుండాలి.
భార్య,భర్త ఇరువురు ఉద్యోగస్థులైన ఒకరు మాత్రమే ఈ రియంబర్స్మెంట్ ను క్లయిం చేయాలి.
ఉద్యోగంలో ఒకరు గజిటెడ్,మరొకరు నాన్ గజిటెడ్ ఉంటే ఈ రియంబర్స్మెంట్ వర్తించదు.
ఉద్యోగి సస్పెన్షన్ లో ఉంటే రియంబర్స్మెంట్ వర్తించదు.
అకడమిక్ సంవత్సరం పూర్తయిన తరువాత ఒరిజినల్ ఫీజు రశీదులు జతచేయాలి.
పిల్లలు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ అటెస్టేషన్ తప్పనిసరి.
డైరెక్టర్ ఆఫ్ ట్రెజరిస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్,తెలంగాణ Memo.No.F4/565/2014 తేది:22.9.2018 ప్రకారం 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ను మాత్రమే అనుమతించాలని. తదుపరి ఉత్తర్వులు అందేవరకు 2015-16 నుండి అరియర్స్ ను అనుమతించకూడదని ఆదేశాలు జారీచేసింది.